Tadikonda: వైసీపీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు

ABN , First Publish Date - 2022-08-21T03:49:47+05:30 IST

తాడికొండ (Tadikonda) నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు (Group Politics) కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌..

Tadikonda: వైసీపీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు

గుంటూరు (Guntur): తాడికొండ (Tadikonda) నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు (Group Politics) కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ (Dokka Manikya Varaprasad)కు తాడికొండ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Mla Undavalli Sridevi) అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా వైసీపీ ఇంచార్జి, మాజీ హోంమంత్రి సుచరిత (Sucharitha)ను కలిశారు. త్వరగా తేల్చకుంటే రాజీనామాలకు సైతం సిద్ధమని ఆమె అనుచర నేతలు తేల్చి చెప్పారు. ఈ 


మరోవైపు డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు మద్దతుగా ఫిరంగిపురంలో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. మాణిక్య వరప్రసాద్ కే తాడికొండ ఇంచార్జి పదవి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని అంటున్నారు. 


దీంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్యే డొక్కా మాణిక్య వరప్రసాద్ మధ్య నెలకొన్న విభేదాలతో తాడికొండలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 


Updated Date - 2022-08-21T03:49:47+05:30 IST