వైసీపీలో వర్గ విబేధాలు

ABN , First Publish Date - 2022-06-12T22:04:37+05:30 IST

వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ నేతలు శివభరత్‌రెడ్డి, దుట్టా రామచంద్రరావు మండిపడ్డారు.

వైసీపీలో వర్గ విబేధాలు

విజయవాడ: వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ నేతలు శివభరత్‌రెడ్డి, దుట్టా రామచంద్రరావు మండిపడ్డారు. ‘‘మాకు పౌరుషం లేదనుకున్నావా వంశీ.. నేను పుట్టింది సీమలోనే. నీలాగా రాయలసీమలో పాలేరు పని చేయలేదు. మేం మనుషులకు వైద్యం చేస్తాం కాబట్టే సంస్కారంతో మాట్లాడుతున్నాం. నువ్వు పశువులకు వైద్యం చేస్తావు కాబట్టే పశువుల్లా ప్రవర్తిస్తున్నావు. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. వైసీపీలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. వల్లభనేని వంశీకి పచ్చిపడితే వైద్యం చేయించుకోవాలి. మేం సహనం కోల్పోతే వంశీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి’’ అని శివభరత్‌ అన్నారు.

Updated Date - 2022-06-12T22:04:37+05:30 IST