గర్భవతిపై వైసీపీ మహిళల అరాచకం

ABN , First Publish Date - 2021-03-09T00:25:03+05:30 IST

వైసీపీ పార్టీకి చెందిన నలుగురు మహిళా కార్యకర్తలు అరాచకానికి పాల్పడ్డారు. గర్భవతిగా

గర్భవతిపై వైసీపీ మహిళల  అరాచకం

తూర్పు గోదావరి: వైసీపీ పార్టీకి చెందిన నలుగురు మహిళా కార్యకర్తలు అరాచకానికి పాల్పడ్డారు. గర్భవతిగా ఉన్న మహిళపై దాడి చేశారు. జిల్లాలో ఈ సంఘటన సంచలనం రేపింది. జిల్లాలోని అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయితీ రావులపాడులో మూడోవిడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి అయిన తన మేనకోడలికి గర్భవతిగా ఉన్న కృష్ణకుమారి సహకరించింది.


టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చిందన్న కారణంతో గర్భవతిగా ఉన్న కృష్ణకుమారిపై వైసీపీకి చెందిన నలుగురు మహిళల కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన కృష్ణకుమారికి తీవ్ర రక్తస్రావం అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టంచుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-03-09T00:25:03+05:30 IST