కేరళలో heavy rains...8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
ABN , First Publish Date - 2021-11-16T17:25:10+05:30 IST
కేరళ రాష్ట్రంలో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్లో వెల్లడించింది...
తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్లో వెల్లడించింది. భారీవర్షాల నేపథ్యంలో కేరళలోని 4 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కేరళలోని కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, మలప్పురం, కన్నూర్, కాసరగడ్, కోజికోడ్ జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నందున భారత వాతావరణ శాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. కొట్టాయం, పతానామిహిట్ట, కొల్లం, అల్లప్పుజా జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. కేరళ యూనివర్శిటీ, ఎంజీ యూనివర్శిటీ మంగళవారం నాడు జరిగే పరీక్షలను వాయిదా వేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అప్పర్ కుట్టానడ్ ప్రాంతంలో వరదనీరు నిలచింది. వరదల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ సూచించారు.