అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదుల డ్రోన్ దాడి

ABN , First Publish Date - 2022-01-17T21:23:27+05:30 IST

అబుధాబీ: అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు జరిపారు.

అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదుల డ్రోన్ దాడి

అబుధాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌కు అత్యంత సమీపంలోని ముసఫ్పా పారిశ్రామికవాడపై ఇరాన్‌ మద్దతున్న యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు జరిపారు. ఈ ఘటనలో మూడు పెట్రోల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాడుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దాడి తమ పనే అని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. 



Updated Date - 2022-01-17T21:23:27+05:30 IST