Bengaluru: ఏడేళ్ల పిల్లాడికి మధ్య రాత్రి మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో అమ్మానాన్న..

ABN , First Publish Date - 2022-05-05T02:14:36+05:30 IST

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి సంబంధాలు అనర్థాలకు దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరి తీరు మాత్రం..

Bengaluru: ఏడేళ్ల పిల్లాడికి మధ్య రాత్రి మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో అమ్మానాన్న..

బెంగళూరు: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి సంబంధాలు అనర్థాలకు దారి తీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. క్షణిక సుఖాల మోజులో బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన రాణి, ఆమె భర్త శంకర్ రెడ్డి యశ్వంత్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. శంకర్ రెడ్డి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. శంకర్ రెడ్డి భార్య రాణి ఇంటి దగ్గరే ఉండి పిల్లాడి బాగోగులు చూసుకునేది.



కానీ.. ఎందుకా పాడు బుద్ధి పుట్టిందో తెలియదు గానీ రాణి తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంది. అప్పుడప్పుడూ ఆమె పుట్టింటికి వెళ్లొస్తుండేది. పాత పరిచయం చిగురించిదో లేక కొత్తగా పరిచయం ఏర్పడిందో తెలియదు గానీ ఆ ఊరిలోని ఒక వ్యక్తితో రాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఆఫీస్‌కు వెళ్లగానే గంటల తరబడి ప్రియుడితో కాల్స్, భర్తకు తెలియకుండా వాట్సాప్‌ చాటింగ్ చేస్తూ రాణి గడిపింది. రాణి, ఆమె ప్రియుడు చివరకు ఒక నిర్ణయానికొచ్చారు. శంకర్‌రెడ్డిని చంపేసి, ఆ హత్యను ఒక దోపిడిగా చిత్రీకరించి కేసు నుంచి బయటపడాలని ప్లాన్ చేశారు. గత గురువారం మధ్య రాత్రి పిల్లాడికి మెలకువ వచ్చి చూసే సరికి శంకర్‌రెడ్డి, అతని భార్య రాణి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అమ్మానాన్నను ఆ స్థితిలో చూసిన పిల్లాడు ఏడుస్తూ కేకలేశాడు. దగ్గర్లో ఉన్న ఇంటి ఓనర్ ఇంటికి ఏడుస్తూ వెళ్లి విషయం చెప్పాడు. ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని రాణి, ఆమె భర్త శంకర్‌ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.



శంకర్ రెడ్డి చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు. గాయపడిన రాణి కోలుకుంది. రాణిని పోలీసులు విచారించగా.. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి తననూ, తన భర్తను కత్తితో గాయపరిచాడని ఆమె చెప్పింది. తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాక్కుని అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులకు తెలిపింది. రాణి వెల్లడించిన విషయం పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు. క్రైం సీన్‌ను పరిశీలించగా పోలీసులకు విషయం అర్థమైపోయింది. బలవంతంగా ఇంట్లోకి ఒక వ్యక్తి చొరబడినట్లుగా అనిపించలేదు. ఆమె తనకు తానుగా గాయపరుచుకుని నాటకం ఆడుతోందని పోలీసులకు అనుమానమొచ్చింది. రాణి ఫోన్‌ను, కాల్ డేటాను పరిశీలించగా అసలు విషయం ఏంటో తెలిసొచ్చింది. రాణినే తన భర్తను కత్తితో పొడిచి, ఆ పై తనకు తాను గాయపర్చుకున్నట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం రాణి తన భర్తను హత్య చేసినట్లుగా తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో రాణి ప్రియుడి పాత్రపై ఆరా తీస్తున్నారు.

Read more