యోగాభ్యసనతో ఆరోగ్య సంరక్షణ

ABN , First Publish Date - 2021-06-22T04:28:49+05:30 IST

యోగాభ్యసనతో ఆరోగ్యం మెరుగుపడుతుందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ అన్నారు.

యోగాభ్యసనతో ఆరోగ్య సంరక్షణ
కొవ్వూరులో యోగాసనాలు

కొవ్వూరు, జూన్‌ 21: యోగాభ్యసనతో ఆరోగ్యం మెరుగుపడుతుందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ అన్నారు. కొవ్వూరులో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మడిచర్ల రామచంద్రరావు యోగాభ్యాసం చేయించారు. యోగా జీవితంలో భాగం కావాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షు డు బోడపాటి ముత్యాలరావు, పిక్కి నాగేంద్ర, కొండపల్లి రత్నసాయి, గెల్లా కేశవ, టి.విజయవాణి, పి.అరుణ, జి.భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:28:49+05:30 IST