‘హెల్త్ వెల్నెస్ సెంటర్లలో యోగా శిక్షకులు’
ABN , First Publish Date - 2022-06-26T06:33:52+05:30 IST
నంద్యాల, కర్నూలు జిల్లాలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లలో యోగా శిక్షకులను నియమించామని, వీరి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ కమిషనర్ కల్నల్ వి.రాములు సూచించారు.
కర్నూలు(హాస్పిటల్),
జూన్ 25: నంద్యాల, కర్నూలు జిల్లాలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లలో యోగా
శిక్షకులను నియమించామని, వీరి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని
ఆయుష్ కమిషనర్ కల్నల్ వి.రాములు సూచించారు. శనివారం కర్నూలు ప్రభుత్వ
వైద్యశాలలో ఉన్న ఆయుర్వేద హోమియో యునాని ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన తనిఖీ
చేశారు. ఆయుష్ కేంద్రాల్లో మందుల కొరత ఉంటే ఇండెంట్ పెట్టాలని
ఆదేశించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు
సేవలందించాలన్నారు. ఆయూష్ కమిషనర్ వెంట డిస్ర్టిక్ట్ ఆయుష్ ఆఫీసర్
డా.టి.చంద్రశేఖర్రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్ వైద్యాధికారి
డా.ద్వారం ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.