కాన్పూర్లో Metro trial runను ప్రారంభించిన సీఎం యోగి
ABN , First Publish Date - 2021-11-10T17:37:21+05:30 IST
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఉదయం కాన్పూర్ మెట్రో ట్రయల్ రన్ను ప్రారంభించారు...
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఉదయం కాన్పూర్ మెట్రో ట్రయల్ రన్ను ప్రారంభించారు. అనంతరం సీఎం యోగి మెట్రో రైలు ప్లాట్ఫారమ్పై అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మెట్రోరైలులో ప్రయాణించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లోని మెట్రో డిపోలో మెట్రో ట్రయల్ రన్ కార్యక్రమం జరిగింది. డిసెంబరు 31వతేదీ నుంచి కాన్పూర్ మెట్రోరైలును ప్రయాణికుల కోసం ప్రారంభించనున్నారు.2019 నవంబరు 15వతేదీన మెట్రో రైలు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కేవలం రెండేళ్లలోనే 9 కిలోమీటర్ల దూరం మెట్రోరైల్వే లైను నిర్మించారు.కాన్పూర్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా 32.5 కిలోమీటర్ల దూరం కారిడార్ నిర్మించనున్నారు.