భాగ్యలక్ష్మి అమ్మవారిని Yogi రేపు దర్శించుకుంటారు: Rajasingh

ABN , First Publish Date - 2022-07-02T15:38:25+05:30 IST

యూపీ‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం రేపటకి వాయిదా పడింది.

భాగ్యలక్ష్మి అమ్మవారిని Yogi రేపు దర్శించుకుంటారు: Rajasingh

Hyderabad : యూపీ‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం రేపటకి వాయిదా పడింది. ఆదివారం ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని ఎమ్మెల్యే రాజసింగ్(MLA Rajasingh) వెల్లడించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాజసింగ్ పిలుపునిచ్చారు. మెదట కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న తర్వాతనే బయట కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని రేపు యోగి దర్శించుకుంటారు. యోగి రాక కోసం పాతబస్తీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-02T15:38:25+05:30 IST