RAHUL GANDHI : మీది రాజీ... మాదైతే రాజీనామా...

ABN , First Publish Date - 2021-12-29T00:46:09+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారత భూభాగాన్ని

RAHUL GANDHI : మీది రాజీ... మాదైతే రాజీనామా...

జైపూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటువంటి పరిస్థితి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎదురై ఉంటే, ఆయన రాజీనామా చేసి ఉండేవారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని, దీనిని ప్రేమతో ఎదుర్కొనాలని చెప్పారు.  మూడు రోజులపాటు జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల  శిక్షణ కార్యక్రమాల ముగింపు సందర్భంగా గాంధీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం మాట్లాడారు. 


కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిక్షణ శిబిరాలను నిర్వహించడం వెనుక లక్ష్యం ఆరెస్సెస్, బీజేపీ భావజాలాన్ని తిప్పికొట్టడం. అంతేకాకుండా కాంగ్రెస్ భావజాలాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ చేయడం. బీజేపీ, ఆరెస్సెస్ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న కుహనా జాతీయవాద ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలను ఈ సందర్భంగా ఆదేశించారు. 


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, (బీజేపీ, ఆరెస్సెస్) వారు మత రాజకీయాల్లో నిమగ్నమయ్యారని, దీనికి కారణం వారికి మరొక అంశం లేకపోవడమేనని తెలిపారు. దేశ ప్రజల హృదయాలను కాంగ్రెస్ పాలించిందని చెప్పారు. 


Updated Date - 2021-12-29T00:46:09+05:30 IST