నిబంధనలు పాటించాల్సిందే..

ABN , First Publish Date - 2021-10-24T05:10:36+05:30 IST

రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, వీటిని అతిక్రమిస్తూ చర్యలు తప్పవని ఎస్‌ఐ పి.పారినాయుడు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శనివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు.

నిబంధనలు పాటించాల్సిందే..
ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న ఎస్‌ఐ పారినాయుడు

జలుమూరు: రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, వీటిని అతిక్రమిస్తూ చర్యలు తప్పవని ఎస్‌ఐ పి.పారినాయుడు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శనివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు మధ్య ఆటోలు ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతన్నాయన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెచ్‌సీలు రాజారావు, రాములు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-24T05:10:36+05:30 IST