ఎన్నికల్లో విజయంకోసం కష్టపడాల్సిందే

ABN , First Publish Date - 2022-06-28T06:06:38+05:30 IST

వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఆ పార్టీ జమ్మలమడుగు పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం జమ్మలమడుగులోని అలంకార్‌ ఫంక్షన్‌ హాలులో నియోజకవర్గ స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశాన్ని

ఎన్నికల్లో విజయంకోసం కష్టపడాల్సిందే
జమ్మలమడుగు ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

ప్లీనరీలో జమ్మలమడుగు పట్టణాధ్యక్షుడు

20 రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు పరిహారం : ఎంపీ

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 27: వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఆ పార్టీ జమ్మలమడుగు పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం జమ్మలమడుగులోని అలంకార్‌ ఫంక్షన్‌ హాలులో నియోజకవర్గ స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కార్యకర్తలు ప్రాణాలకు తెగించి వైసీపీకి సహకారం అందించారన్నారు. అలాంటివారికి జమ్మలమడుగులో అధికారులు పలకడంలేదని విమర్శించారు. ఇలా అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ విజయానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తాము అండగా నిలుస్తామన్నారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం అవుతాయన్నారు. సున్నపురాళ్లపల్లెలోని స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతులకు 20 రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కొండాపురం మునక ప్రాంతంలో గతంలో చెప్పిన విధంగా రూ.3.25 లక్షలు పెండింగ్‌ పరిహారాన్ని ఆరు మాసాలలోగా చెల్లిస్తామన్నారు. కడప నగర మేయర్‌ సురేశ్‌బాబు, జిల్లా వైసీపీ జనరల్‌ సెక్రటరీ దన్నవాడ మహేశ్వర్‌రెడ్డి, బడిగించల విజయలక్ష్మి, లొగిడి జయన్న తదితరులు మాట్లాడారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు, నాయకులు వారి వారి సమస్యలను ఎంపీకి విన్నవించారు.




Updated Date - 2022-06-28T06:06:38+05:30 IST