మీ ఓటును మీరే కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2022-08-12T06:09:18+05:30 IST
వైసీపీ ఎన్నికల్లో వలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని కుట్ర, కుతంత్రాలతో జగన్రెడ్డి ఓటు హక్కును అపహస్యం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
దేవినేని ఉమామహేశ్వరరావు
గొల్లపూడి, ఆగస్టు 11: వైసీపీ ఎన్నికల్లో వలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని కుట్ర, కుతంత్రాలతో జగన్రెడ్డి ఓటు హక్కును అపహస్యం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రజలు మీ ఓటును మీరే కాపాడుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో 265 పోలింగ్బూత్లో రెండో రోజు గురువారం పర్యటించారు. సమస్యలు తెలుసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు చైతన్యంతో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది సద్వినియోగం చేసుకోవాలన్నారు.