ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే...
ABN , First Publish Date - 2022-05-31T18:04:03+05:30 IST
తొమ్మిదేళ్ళ పాటు ప్రేమించిన యువతి మోసం చేసిందనే కారణంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటు చేసుకుంది.
బెంగళూరు: తొమ్మిదేళ్ళ పాటు ప్రేమించిన యువతి మోసం చేసిందనే కారణంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిక్కమగళూరులోని ఎన్ ఆర్ పుర తాలూకా శంకరపుర గ్రామానికి చెందిన చేతన్(31)కు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తొమ్మిదేళ్ళుగా ప్రేమించినట్లు వాయిస్ మెసేజ్తో పాటు డెత్నోట్లోను చేతన్ రాసిపెట్టాడు. చాలకాలంగా ప్రేమలో ఉన్నామని విషయం అందరికీ తెలుసన్నాడు. ఇటీవల యువతి ప్రేమను నిరాకరించారని డెత్నోట్లో రాసుకున్నాడు. నాలుగు లక్షలకు పైగా నగదు తీసుకున్నారని రాశారు. ఉరి వేసుకుని చేతన్ ఆత్మహత్య చేసుకోగా పోలీసులు జరిపిన సోదాలలో డెత్నోట్ లభించినట్లు తెలిపారు. డెత్ నోట్లో ఆత్మహత్యకు ప్రేమను నిరాకరించడమే కారణమని న్యాయం జరగాలంటే ఆమెకు శిక్ష పడాలని రాసు కున్నట్లు ఎన్ఆర్ పుర తాలూకా పోలీసులు తెలిపారు. చితికి ఆమె నిప్పు పెట్టాలని వాయిస్ మెసేజ్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రేమించి వదిలేస్తున్నట్లు వేధించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు డెత్నోట్లో రాసుకున్నాడని సమగ్ర విచారణలు జరుపుతున్నట్లు ఎన్ఆర్ పుర తాలూకా పోలీసులు తెలిపారు.