రాత్రి తల్లిదండ్రులతో భోజనం చేశాక తన గదిలోకి వెళ్లిన 23 ఏళ్ల యువతి.. తెల్లారినా లేవలేదేంటని కూతురి గదిలోకి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-05-13T01:04:11+05:30 IST

ఆ యువతి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఎప్పటిలాగే తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసింది. అనంతరం తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఈ క్రమంలో తెల్లారిన తర్వాత ఎంతకూ ఆమె గది నుంచి బయటకు రా

రాత్రి తల్లిదండ్రులతో భోజనం చేశాక తన గదిలోకి వెళ్లిన 23 ఏళ్ల యువతి.. తెల్లారినా లేవలేదేంటని కూతురి గదిలోకి వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఎప్పటిలాగే తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసింది. అనంతరం తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఈ క్రమంలో తెల్లారిన తర్వాత ఎంతకూ ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో.. తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం కూతురు గదిలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



చత్తీస్‌గడ్‌కు చెందిన సత్యభామ అనే యువతి Janjgir-Champa ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ స్థానిక కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసింది. తర్వాత తన గదికి వెళ్లి పడుకుంది. అయితే ఉదయం ఎంతకూ సత్యభామ తన గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె అనారోగ్యానికి గురైందేమో అనే అనుమానంతో గదికి వెళ్లారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. గదిలో ఊరితాడుకు సత్యభామ విగత జీవిగా వేలాడటం చూసి బోరున విలపించారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దీనిపై కేసు నమోదు చేసుకుని.. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


Read more