చందాన‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2020-09-21T00:01:56+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని చందాన‌గ‌ర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైంది.

చందాన‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో యువతి అదృశ్యం

హైదరాబాద్ : నగరంలోని చందాన‌గ‌ర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైంది. వివరాల్లోకెళితే.. చందానగర్‌లోని ఇందిరాన‌గ‌ర్ కాల‌నీలో ప‌ల్లపు అశోక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇత‌ను స్థానిక బెల్ ప‌రిశ్రమ‌లో కాంట్రాక్ట్ లేబ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దేవి (20)కి ఇటీవ‌లే వివాహం నిశ్చయ‌మైంది. ఈ క్రమంలో ఆమె ఈ నెల 19వ తేదీన ఉద‌యం 4 గంట‌ల‌కు ఇంట్లో ఎవ‌రికీ చెప్పకుండా బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.


24 గంటలు దాటినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆమె కోసం కుటుంబ స‌భ్యులు అన్ని చోట్లా గాలించారు. అయిన‌ప్పటికీ ఆమె ఆచూకీ తెలియ‌లేదు. ఎక్కడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చందానగర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-21T00:01:56+05:30 IST