పెళ్లి ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి

ABN , First Publish Date - 2021-06-17T14:30:55+05:30 IST

మంగళవారం రాత్రి రిదీ వివాహం గురించి ఇంట్లో ప్రస్తావించడంతో...

పెళ్లి ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి

హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : పెళ్లి ఇష్టం లేని ఓ యువతి అదృశ్యమైన ఘటన జవహర్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన హరికిషన్‌ షాదే యాప్రాల్‌లో మిర్చి హోటల్‌ నడిపిస్తున్నాడు. ఇతడికి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమార్తె రిదీషాద్‌ (22) హోటల్‌లో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి రిదీ వివాహం గురించి ఇంట్లో ప్రస్తావించడంతో ఆమెకు పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. బుధవారం ఇంటినుంచి వెళ్లిపోయింది. తెలిసినవారివద్ద ఎంత వెతికినా కూతురు ఆచూకీలభించలేదు. ఆరేళ్లక్రితం రాజస్థాన్‌లో ఉన్నపుడు దేవ్‌ అనే యువకుడు రిదీషాద్‌ ప్రేమించుకోవడంతో ఇరువురిని మందలించామని, దేవ్‌పై అనుమానం ఉందని పోలీసులకు హరికిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


విద్యార్థిని..

ఆనంద్‌బాగ్‌ : మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరా నెహ్రూనగర్‌లో ఉంటున్న శ్రావణి (21) జాగృతి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. జూన్‌ 15న షాపునకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు  తెలిసిన చోట్ల వెదికినా అమె ఆచూకీ లభించలేదు. ఆమె తల్లి కల్యాణి మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-06-17T14:30:55+05:30 IST