Hyderabad : ఫ్రెండ్స్ కదా యువతి ఫోన్ చేయగా..!

ABN , First Publish Date - 2021-07-16T14:15:01+05:30 IST

స్నేహితులు కదా అని తన ఫోన్‌ ఇస్తే...

Hyderabad : ఫ్రెండ్స్ కదా యువతి ఫోన్ చేయగా..!

  • స్నేహితురాలికి వేధింపులు
  • ఇద్దరు యువతుల నిర్వాకం! 
  • సైబర్‌క్రైమ్స్‌లో బాధితురాలి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : స్నేహితులు కదా అని తన ఫోన్‌ ఇస్తే అందులో ఉన్న డేటాను వారి ఫోన్లలోకి కాపీ చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఓ యువతి గురువారం సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. నగరానికి చెందిన యువతి మొవ్యకు చెందిన ఫోన్‌ను స్నేహితులు పూర్ణిమ, సుమతిలు తీసుకున్నారు. ఫోన్‌లోని ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం, వీడియోలు అన్నీ వారి ఫోన్‌లోకి కాపీ చేసుకున్నారని, వారు చెప్పినట్లు వినాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరికీ సంబంధించిన వివరాలు, కాల్‌ రికార్డింగ్స్‌ కూడా పోలీసులకు అందచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-16T14:15:01+05:30 IST