నిజాంసాగర్లో దూకి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-25T05:35:11+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్టు 16 వరద గేట్ల వద్ద యువకుడు ప్రాజెక్టులో దూకి ఆదివారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.
నిజాంసాగర్, జనవరి 24: నిజాంసాగర్ ప్రాజెక్టు 16 వరద గేట్ల వద్ద యువకుడు ప్రాజెక్టులో దూకి ఆదివారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన వడ్ల రమేష్(25) ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో వారికి నిజాంసాగర్కు వెళుతున్నానని చెప్పి వచ్చాడు. నిజాంసాగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ సాయంత్రం నిజాంసాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రమేష్ మేస్ర్తి పని చేస్తుంటాడు. ఎప్పుడు మద్యం తాగుతూ నేను చనిపోతానని ఇంట్లో వారికి చెబు తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. తాగుడు, చెడు వ్యసనాలకు బానీసై కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు లు తెలిపారు. రోజు వారీ మాదిరిగానే రమేష్ ఉదయాన్నే మద్యం తాగి నిజాంసాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఏఎస్సై రాజ లింగం తెలిపారు. భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రాజెక్టులో నుంచి శవాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించామన్నారు.