ప్రేయసి మరణవార్త విని..దుబాయిలో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-24T10:15:45+05:30 IST

ప్రేయసి మరణంతో ఆ ప్రేమికుడు మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని జీవితం వద్దనుకున్నాడు. జీవితం

ప్రేయసి మరణవార్త విని..దుబాయిలో యువకుడి ఆత్మహత్య

గొల్లపల్లి, జనవరి 23: ప్రేయసి మరణంతో ఆ ప్రేమికుడు మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని జీవితం వద్దనుకున్నాడు. జీవితంపై విరక్తితో.. దేశం కాని దేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన మానాల రాజేష్‌ (24).. గోవిదపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఉపాధి కోసం ఏడాది క్రితం రాజేశ్‌ దుబాయి వెళ్లాడు. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించు కున్నారు. ఇంతలో వారి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది. వారు మందలించడంతో.. ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రాజేష్‌.. దుబాయ్‌లో తను ఉంటున్న గదిలోనే ఉరేసుకున్నాడు. అంతకుముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన తల్లికి పంపించాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.   


Updated Date - 2021-01-24T10:15:45+05:30 IST