రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-04-18T06:27:29+05:30 IST

మండలంలోని ఆమిదాలగొంది గ్రామానికి చెందిన నరేష్‌(27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మడకశిర టౌన్‌,ఏప్రిల్‌ 17: మండలంలోని ఆమిదాలగొంది గ్రామానికి చెందిన నరేష్‌(27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. శుక్రవారం సాయంత్రం మడకశిర పట్టణం నుంచి  ఆమిదాలగొందికి వెళ్తుండగా పట్టణ సమీపంలోని చంద్ర మౌళేశ్వరస్వామి ఆలయం సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకున్నాడు. తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108కు సమాచారం అందించారు. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. మెరుగైన చికిత్సల కోసం హిందూపురంకు తరలించారు. వైద్యుల  సూచనల మేరకు అక్కడి నుంచి బెంగుళూరుకు తరలిస్తుండగా గౌరీబిదనూరు సమీపంలో రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరే్‌షకు భార్యతో పాటు 9 నెలల కుమారుడు ఉన్నాడు.


Updated Date - 2021-04-18T06:27:29+05:30 IST