రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-26T06:45:53+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
మరొకరికి తీవ్రగాయాలు
ఐరాల(కాణిపాకం), నవంబరు 25: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కాణిపాకం ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంటకు చెందిన వెంకటప్ప కుమారుడు బాల (25), అతడి మిత్రుడు మొగిలీశ్వర్ పూతలపట్టు నుంచి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయల్దేరారు. కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిగరపల్లె వద్ద జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ముందు వెళుతున్న వ్యానును ప్రమాదవశాత్తూ వెనుకనుంచి ఢీకొన్నారు. బాల అక్కడికక్కడే మృతి చెందారు. మొగిలీశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాగిమానుపెంట సర్పంచ్ తోటశ్రీహరి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.