హల్దీవాగు డ్యాంలో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-11T05:42:55+05:30 IST
తూప్రా న్ మండలం కిష్టాపూర్ హల్ధీవాగుడ్యాంలో పడి యువకుడు మృతిచెందాడు. ఈసంఘటన సోమవారం చోటుచేసుకుంది. తూప్రాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ మండలం నవాబుపేటకు చెందిన గొడుపల్లి సతీ్షగౌడ్ (34) హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసముంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
తూప్రాన్, మే10 : తూప్రా న్ మండలం కిష్టాపూర్ హల్ధీవాగుడ్యాంలో పడి యువకుడు మృతిచెందాడు. ఈసంఘటన సోమవారం చోటుచేసుకుంది. తూప్రాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ మండలం నవాబుపేటకు చెందిన గొడుపల్లి సతీ్షగౌడ్ (34) హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసముంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారం క్రితం తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్లో ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చాడు. తూప్రాన్-కిష్టాపూర్ మధ్యన గల హల్దీవాగు చెక్డ్యాం వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ పోలీసులు తెలిపారు.