గోదావరిలో యువకుడి మృతదేహం
ABN , First Publish Date - 2022-05-20T05:37:48+05:30 IST
పెనుగొండ మండలం నడిపూడి గోదావరినదిలో మృతదేహం లభ్యమైంది.
పెనుగొండ, మే 19: పెనుగొండ మండలం నడిపూడి గోదావరినదిలో మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ మోహనరావు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం అమలాపురం మండలం జనుపల్లి, పరిసర గ్రామాలకు చెందిన కొందరు యువకులు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉడిమూడిలంక గోదావరి తీరంలో సరదాగా గడపటానికి వచ్చారు. కొద్దిసేపు సరదాగా గడిచిన తరువాత వీరంతా గోదావరిలోకి స్నానానికి దిగారు. వీరిలో ప్రమాదవశాత్తు యర్రంశెట్టి రాజా (22) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. గురువారం పెనుగొండ మండలం నడిపూడి గోదావరి నదిలో రాజా మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.