విద్యుదాఘాతానికి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-09T06:21:22+05:30 IST
సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల మధిర గ్రామమైన వడ్డెర కాలనీలో శనివారం విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు.
సిద్దిపేట రూరల్, మే 8: సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల మధిర గ్రామమైన వడ్డెర కాలనీలో శనివారం విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వల్లెపు ప్రశాంత్ (20) తన ఇంటి మేడపై నుంచి దిగుతుండగా మెట్లకు గల ఇనుప కడ్డీలను పట్టుకోగా షార్ట్సర్క్యూట్ సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట రూరల్ ఎస్ఐ శంకర్ తెలిపారు.