విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-05-19T06:25:28+05:30 IST

రామకుప్పం పట్టణంలోని ఓ సామిల్లులో పనిచేస్తున్న రాంనగర్‌కు చెందిన వాహీద్‌(35) విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి
విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన వాహీద్‌

రామకుప్పం, మే 18: పట్టణంలోని ఓ సామిల్లులో పనిచేస్తున్న రాంనగర్‌కు చెందిన వాహీద్‌(35) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కొనేళ్ళుగా సామిల్లులో కొయ్యదిమ్మెలు కోసే మెషిన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం యఽథావిధిగా సామిల్లు చేరుకుని  దిమ్మెలను కోసే మోటరును ఆన్‌ చేశాడు. స్విచ్‌ వేయగానే విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. గమనించిన యజమాని సహచరులు వాహీద్‌ను రామకుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా వాహీద్‌కు  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య షమా ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-05-19T06:25:28+05:30 IST