సరిగ్గా 8 నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఊహించని ఘటన.. భార్య పెట్టే వేధింపులు భరించలేనంటూ..

ABN , First Publish Date - 2022-07-28T19:52:37+05:30 IST

అతడికి సరిగ్గా 8 నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జీవితాన్ని అందంగా ఊహించుకున్న అతడికి నిరాశ ఎదురైంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల నుంచి అనూ

సరిగ్గా 8 నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఊహించని ఘటన.. భార్య పెట్టే వేధింపులు భరించలేనంటూ..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి సరిగ్గా 8 నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత జీవితాన్ని అందంగా ఊహించుకున్న అతడికి నిరాశ ఎదురైంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల నుంచి అనూహ్యంగా ఓ డిమాండ్ తెర మీదకు రావడంతో తొలుత కంగుతిన్నాడు. ఆ తర్వాత భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడం.. భార్య వేధింపులు ఎక్కువ కావడంతో అతడు తట్టుకోలేకపోయాడు. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌(Rajasthan)కు చెందిన అభిషేక్ యువకుడికి సుమారు 8 నెలల క్రితం.. ఆగ్రా(Agra) ప్రాంతానికి చెందిన అవంతిక అనే యువతితో వివాహం( Marriage) జరిగింది. పెళ్లైన తర్వాత కొన్ని రోజుల వరకు వారి సంసారం బాగానే సాగింది. కానీ ఆ తర్వాతే అతడిని సమస్యలు చుట్టుముట్టాయి. ఆస్తిలో కొంత భాగాన్ని తన పేరుపై రాయాలంటూ భార్య కోరడంతో తొలుత కంగుతిన్నాడు. అనంతరం ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం అతడి మాట వినలేదు.



పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి అభిషేక్‌పై కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దాదాపు ప్రతి రోజు అభిషేక్ పోలీస్ స్టేషన్ (Police Station)చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో విసుగు చెందిన అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అభిషేక్ విషం తాగిన విషయాన్ని అతడి తల్లిదండ్రులు గుర్తించి.. స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. ప్రాణాలు విడవటానికి ముందు.. తన తండ్రితో మాట్లాడిన అభిషేక్.. భార్య పెట్టే వేధింపులు భరించలేకే ఈ పని చేసినట్టు వాపోయాడు. కాగా.. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభిచారు. 


Updated Date - 2022-07-28T19:52:37+05:30 IST