మానసిక ఆరోగ్యంపై బోధించాలని పాదయాత్ర
ABN , First Publish Date - 2021-01-17T09:52:47+05:30 IST
దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై బోధించాలని కోరుతూ ఝార్ఖండ్లోని రాంచీకి చెందిన యువకుడు రోణిత్ చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్ జిల్లా
నిర్మల్ చేరుకున్న ఝార్ఖండ్ యువకుడు
నిర్మల్ కల్చరల్, జనవరి 16 : దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై బోధించాలని కోరుతూ ఝార్ఖండ్లోని రాంచీకి చెందిన యువకుడు రోణిత్ చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రోణిత్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. తనకు కలిగిన మానసిక ఆందోళన దృష్ట్యా ప్రజల్లో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై బోధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.