ఆటో ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:15:15+05:30 IST

బైకును ఆటో ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఎస్‌.కోట మండలంలోని గోపాలపల్లి వంతెన వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

ఆటో ఢీకొని యువకుడి మృతి

శృంగవరపుకోట రూరల్‌, నవంబరు 28: బైకును ఆటో ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఎస్‌.కోట మండలంలోని గోపాలపల్లి వంతెన వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన అనకాపల్లి ప్రవీణ్‌కుమార్‌(25) డిగ్రీ పూర్తిచేశాడు. రెండేళ్లగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన కొత్తవిషయాలు తెలుసుకునేందుకు ఆదివారం తన బైకుపై విజయనగరం వెళ్తున్నాడు. గోపాలపల్లి వంతెనపైకి వచ్చేసరికి, ఎదురుగా ఎస్‌.కోట నుంచి విజయనగరం వస్తున్న అయ్య న్నపేటకు చెందిన ఆటో ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌కు తలపై బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ఓ అక్క ఉంది.  చేతికి అందొచ్చిన కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రశన్నకుమార్‌ కేసు నమోదు చేశారు.

 

Updated Date - 2021-11-29T05:15:15+05:30 IST