ఆగి ఉన్న డీసీఎంను ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-11T07:13:40+05:30 IST

రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొని యువకుడు మృతి చెందాడు.

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొని యువకుడి మృతి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన

చిట్యాల రూరల్‌, మే 10: రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొని యువకుడు మృతి చెందాడు. చిట్యాల ఏఎస్‌ఐ డి.నర్సిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) రామన్నగూడెంకు చెందిన సిలివేరు ఉమేష్‌(25) హైదరాబాద్‌లో  డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి  స్వగ్రా మానికి బైక్‌పై వెళుతుండగా మార్గమధ్యలో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రహదారిపై మరమ్మత్తుల కోసం నిలిపి ఉన్న డీసీఎంను ప్రమాదవశాత్తు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన మరో ఉమేష్‌ మృతదేహం నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జయ్యింది. ఈఘటనలో డీసీఎం డ్రైవరుకు గాయాలయ్యాయి. ఉమేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్ల గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-11T07:13:40+05:30 IST