రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-24T04:33:50+05:30 IST

జాతీయ రహదారిలోని డైట్‌ కళాశాల సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ (19) అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మృతుడు నర్సాపురం వాసి
కశింకోటలో రైలు ఢీకొని మరొకరు..

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 23:
జాతీయ రహదారిలోని డైట్‌ కళాశాల సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సాపురం నుంచి తేజ ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తేజ గృహ నిర్మాణ పనులు చేస్తుంటాడు. సమాచారం తెలుసుకున్న మృతుని తండ్రి రాంబాబు అనకాపల్లి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్‌ ఎస్‌ఐ అప్పలకొండ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
కశింకోట:
బయ్యవరం-నర్సింగబిల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొన్న సంఘటనలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని రైల్వే ఎస్‌ఐ అబ్దుల్‌ మారూఫ్‌ తెలిపారు. 50 ఏళ్ల వయస్సు ఉండే సదరు వ్యక్తి బిస్కట్‌ రంగు చొక్కా, తెలుపు రంగు పంచె ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచామన్నారు. వివరాలు తెలిసినవారు 9494887786 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2021-04-24T04:33:50+05:30 IST