రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-17T04:47:23+05:30 IST
గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
చేగుంట, అక్టోబరు 16: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చేగుంట మండలంలోని రెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన మేరకు.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్కు చెందిన కుమ్మరి వేణుగోపాల్ అతడి స్నేహితుడు పవన్ కళ్యాణ్ బైక్పై చేగుంటకు పని నిమిత్తం వచ్చారు. అనంతరం రెడ్డిపల్లి శివారులోని దాబాకు టీ తాగడానికి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వేగంగా వెళుతున్న గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో వేణుగోపాల్కు తీవ్ర గాయాలు కాగా పవన్కు స్వల్ప గాయాలయ్యాయి వీరిని కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వేణుగోపాల్ మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.