రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

ABN , First Publish Date - 2022-06-28T05:33:56+05:30 IST

రామడుగు మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు అనుపురం దీపక్‌(21) కొత్తపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన రామడుగులో విషాదాన్ని నింపింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దీపక్‌

 - రామడుగులో విషాదం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

- వెంటాడిన విధి


రామడుగు, జూన్‌ 27: రామడుగు మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు అనుపురం దీపక్‌(21) కొత్తపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన రామడుగులో విషాదాన్ని నింపింది. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణపు అంచులోకి వెళ్లిన దీపక్‌ను పోలీసులు తక్షణ ప్రథమ చికిత్స చేసి బతికించారు. కాగా సోమవారం ఉదయం బైక్‌పై కరీంనగర్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కొత్తపల్లి సమీపంలో మృతిచెందాడు. గతంలో మృత్యువు నుంచి తప్పించుకున్న దీపక్‌ మళ్లీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

Updated Date - 2022-06-28T05:33:56+05:30 IST