వాహనం ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-04-13T05:23:56+05:30 IST
మండలంలోని పెదమానాపురం సంతతోట వద్ద సోమవారం తెల్ల వారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి చెందాడు.
దత్తిరాజేరు, ఏప్రిల్ 12: మండలంలోని పెదమానాపురం సంతతోట వద్ద సోమవారం తెల్ల వారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి చెందాడు. పెదమానాపురం ఎస్సై రమేష్ నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం బడేవలస గ్రామానికి చెందిన ఎలకల రూపు సుందరరావు(18), స్నేహితులు ఎవర్న గౌరీశంకర్, నడుపూరి సత్యనారాయణతో కలిసి ద్విచక్ర వాహనంపై సంతతోటనుంచి గజపతినగరం వైపు వ స్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన వారిని 108 వాహనంలో స్థానికులు గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుందరరావు మృతి చెందాడు. మిగిలిన క్షతగాత్రులిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఎలకల శ్రీరాం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.