యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2021-01-22T05:26:14+05:30 IST
పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ ఈశ్వరరావు గత 45రోజులుగా కనిపించడం లేదంటూ అతడి తల్లి సైలాడ సన్యాసమ్మ గురువారం ఫిర్యాదు చేసినట్టు బూ ర్జివలస ఎస్ఐ బి.భాగ్యం తెలిపారు.
దత్తిరాజేరు : పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ ఈశ్వరరావు గత 45రోజులుగా కనిపించడం లేదంటూ అతడి తల్లి సైలాడ సన్యాసమ్మ గురువారం ఫిర్యాదు చేసినట్టు బూ ర్జివలస ఎస్ఐ బి.భాగ్యం తెలిపారు. ఈశ్వరరావు ఐదేళ్లుగా విశాఖలోగల అక్కయ్యపాలెం రోడ్డులో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకునేవాడని, గతేడాది నవంబరులో ఇంటికి వచ్చి... తిరిగి విశాఖ వెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ కూడా చేయలేదని, సంక్రాంతికి వస్తాడని ఎదురుచూసినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
ఎగువ ఎర్రవానిపాలెంలో ఒకరు...
కొత్తవలస : తన కుమారుడు కనిపించడం లేదంటూ కొత్తవలస పంచా యతీ ఎగువ ఎర్రవానిపాలెం గ్రామానికి చెందిన వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. పోలీసుల కథనం మేరకు... అప్పికొండ నూకరాజు (19) విశాఖ జిల్లా గాజువాకలో ఓ బేకరీ షాపులో పనిచేస్తున్నాడు. సంక్రాంతికి వచ్చిన నూకరాజు ఈ నెల 17న తిరిగి విశాఖ వెళ్లాడు. ఆ తర్వాత కుమారుడికి ఈ నెల 19న ఫోన్ చేస్తే... స్విచ్చాఫ్ వస్తుం డడంతో.. బేకరి యజమానికి ఫోన్ చేయగా అక్కడికి రాలేదని చెప్పారు. దీంతో కుమారుడి ఆచూకీకోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్ర యించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.