యువకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-09-04T16:52:15+05:30 IST
సేలం జిల్లా మేట్టూరు సమీపంలో 17 యేళ్ళ మైనర్ బాలుడిని హత్య చేసి, మృతదేహాన్ని కావేరి నదిలో పడేసిన విషాదకర ఘటన ఒకటి తాజా
- శవాన్ని కావేరి నదిలో పడేసిన వ్యక్తి
- పోలీసుల గాలింపు చర్యలు
అడయార్(చెన్నై), సెప్టెంబరు 3: సేలం జిల్లా మేట్టూరు సమీపంలో 17 యేళ్ళ మైనర్ బాలుడిని హత్య చేసి, మృతదేహాన్ని కావేరి నదిలో పడేసిన విషాదకర ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గోవిందపడి గ్రామానికి చెందిన పొక్కిషం (17) అనే బాలుడు పదో తరగతి చదువుకుంటూ, స్కూల్ లేని సమయంలో పనికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీ నుంచి కనిపించకండా పోయాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కరుమలైకూడల్ ప్రాంతంలో దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆనంద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా, ఈ బాలుడి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పొక్కిషంను హత్య చేసి శవాన్ని కావేరీ నదిలో పడేసినట్టు అంగీకరించాడు. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆనంద్పై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.