పెళ్లయిన 20 రోజుల తర్వాత ప్రేయసికి ఫోన్.. ప్రియుడు పిలిచాడని తెల్లవారుజామున 4 గంటలకు ఆమె వెళ్తే..

ABN , First Publish Date - 2022-06-11T17:50:31+05:30 IST

అతను తన గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు..

పెళ్లయిన 20 రోజుల తర్వాత ప్రేయసికి ఫోన్.. ప్రియుడు పిలిచాడని తెల్లవారుజామున 4 గంటలకు ఆమె వెళ్తే..

అతను తన గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు.. అయితే అతను అనుకున్నట్టు జరగలేదు.. కుటుంబ సభ్యుల బలవంతంతో వేరే యువతిని వివాహం చేసుకున్నాడు.. పెళ్లయిన 20 రోజుల తర్వాత తెల్లవారు ఝామున 4 గంటలకు ప్రేయసికి ఫోన్ చేసి తను చెప్పిన చోటుకు రమ్మన్నాడు.. ప్రియుడు చెప్పిన చోటుకు ఆమె వెంటనే వచ్చింది.. అక్కడ ప్రేయసిపై ప్రియుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.. ప్రేయసి పరిస్థితిని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఇది కూడా చదవండి..

ఒకే మంటపంలో ఇద్దరిని పెళ్లాడిన కుర్రాడు.. వధువుల ఒడిలో చెరో పాపను చూసి బంధువులంతా షాక్.. అసలు కథేంటంటే..


రాజస్థాన్‌లోని దౌసాలో కుర్హాద్ పురా గ్రామానికి చెందిన లఖన్ సింగ్ (24) అదే గ్రామానికి చెందిన యువతి సప్నా (18)తో ప్రేమలో పడ్డాడు. అయితే కుటుంబ సభ్యుల బలవంతం వల్ల మే 24న వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సప్నాకు లఖన్ ఫోన్ చేసి గ్రౌండ్‌కు రమ్మని పిలిచాడు. సప్నా రాగానే ఆమెపై కాల్పులు జరిపాడు. తర్వాత సప్నా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. `మీ కుమార్తెను తుపాకీతో కాల్చాను. శరీరాన్ని తీసుకెళ్లండి` అని చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సప్నాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.


వెంటనే లఖన్ తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం మరణించాడు. చనిపోవడానికి ముందు `లఖన్ ఇక ఈ ప్రపంచంలో ఉండడు` అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. లఖన్ ఎందుకు ఇలా చేశాడనే దాని గురించి దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-06-11T17:50:31+05:30 IST