యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-01T06:07:18+05:30 IST
యువకుడి ఆత్మహత్య
మహదేవపూర్, ఫిబ్రవరి 28 : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బట్టికొట్టు ప్రాంతానికి చెందిన తాయినేని శేఖర్ (25) ఓ వాటర్ ప్లాంటులో పనిచేస్తున్నాడు. కొంతకా లంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు మందలిం చడంతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మహదేవపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు.