యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2021-04-24T04:10:41+05:30 IST

యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి

యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
మిల్క్‌ డిస్ర్టిబ్యూటర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


చేవెళ్ల: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా యువత స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన సహస్ర మిల్క్‌ డిస్ర్టిబ్యూటర్‌ సెంటర్‌ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువత ప్రైవేట్‌ రంగాల్లో అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్‌ చైర్మెన్‌ దేవర వెంకట్‌రెడ్డి, చేవెళ్ల, ఆలూర్‌ గ్రామ సర్పంచ్‌లు బండారు శైలజాఆగిరెడ్డి, విజయలక్ష్మీ, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, చేవెళ్ల ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఆలూర్‌ ఎంపీటీసీ నరేందర్‌చారి, మాజీ సర్పంచ్‌లు జంగారెడ్డి, అమేందర్‌గౌడ్‌, నిర్వాహకులు నవీన్‌గౌడ్‌, న్యాయవాది బక్కరెడ్డి యాదిరెడ్డి, నాయకులు నవీన్‌చారి, శ్రీనివా్‌సగౌడ్‌, జంగయ్యగౌడ్‌, రాజ్‌గౌడ్‌, రమేశ్‌, మహేందర్‌, రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:10:41+05:30 IST