మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-06-27T05:14:27+05:30 IST
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
కొత్తూర్, జూన్26: మత్తు, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీసులు, సంకల్ప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఈసందర్భంగా సంకల్ప్ సంస్థ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీవై్సచైర్మన్ ఈటగణేష్, కొత్తూర్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్లు బాతుక లావణ్య దేవేందర్యాదవ్, కొందూటి నరేందర్, సీఐ బాల్రాజ్, ఎస్ఐశంకర్, డోలీరవీందర్, జిల్లెల వెంకట్రెడ్డి, రాజేందర్గౌడ్, కోస్గి శ్రీనివాస్, చింటూ, సంపత్రావు, బీసా సాయిబాబా, యాదగిరి, రవినాయక్, రాఘవేందర్యాదవ్ పాల్గొన్నారు.
ఆధ్మాత్మిక చింతనను అలవర్చుకోవాలి
ప్రతిఒక్కరూ ఆధ్మాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఓసీవీ మాజీ ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అభిషేకం, కల్యాణమహోత్సవం, సుదర్శనహోమంనిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదానం చేశారు.