పీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-06-17T05:11:05+05:30 IST

పాలమూరు యూనివర్శిటీ మైక్రోబయాలజీ అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శాంతిప్రియకు మైక్రోబయాలజీ ఆఫ్‌ ఇండియా ప్రతియేటా ఇచ్చే యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు దక్కింది.

పీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు  యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు
అవార్డుకు ఎంపికైన డాక్టర్‌ శాంతిప్రియను అభినందిస్తున్న వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తదితరులు

-  ఆన్‌లైన్‌ ద్వారా అవార్డు స్వీకరించిన డాక్టర్‌ శాంతిప్రియ 

-  అభినందించిన వైస్‌ చాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌


 పాలమూరు యూనివర్శిటీ, జూన్‌ 16 : పాలమూరు యూనివర్శిటీ మైక్రోబయాలజీ అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శాంతిప్రియకు మైక్రోబయాలజీ ఆఫ్‌ ఇండియా ప్రతియేటా ఇచ్చే యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆమె బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిం చారు. ఈ సందర్భంగా బుధవారం యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫె సర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ఆమెను సన్మానించి, అభినందించారు. ఈ కార్యకమ్రంలో రిజిస్ట్రార్‌ పవన్‌ కుమార్‌, ఓఎస్‌డీ మధుసూదన్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ నూర్జహాన్‌ బేగం, ఈసీ మెంబర్‌ ప్రొఫెసర్‌ గిరిజామంగ తాయారు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:11:05+05:30 IST