స్నేహితుడి ద్వారా మహిళ పరిచయం.. చివరికి..

ABN , First Publish Date - 2021-06-17T13:39:50+05:30 IST

స్నేహితుడి ద్వారా ఓ మహిళ పరిచయం అయింది. వారి స్నేహం...

స్నేహితుడి ద్వారా మహిళ పరిచయం.. చివరికి..

  • మహిళను వేధిస్తున్న యువకుడి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ : మహిళను సోషల్‌ మీడియాలో లైంగికంగా వేధిస్తున్న యువకుడు కటకటాల పాలయ్యాడు. సైదాబాద్‌కు చెందిన చిన్న వెంకన్న రాజశేఖర్‌రెడ్డికి స్నేహితుడి ద్వారా ఓ మహిళ పరిచయం అయింది. వారి స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజశేఖర్‌రెడ్డి దురుసు ప్రవర్తన, పద్ధతి నచ్చకపోవడంతో ఆమె అతడిని కొంతకాలంగా దూరం పెడుతోంది. దీంతో మహిళపై కక్ష పెంచుకున్నాడు. ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు క్రియేట్‌ చేశాడు. గతంలో ఆమెతో సన్నిహితంగా దిగిన ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేశాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ ఫోస్టు చేస్తున్నాడు. మహిళ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పోస్ట్‌లు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేశారు. 

Updated Date - 2021-06-17T13:39:50+05:30 IST