తండ్రి మందలించాడని యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-02T05:54:04+05:30 IST
పీలేరులోని ఇందిరానగర్లో నివసిస్తున్న శ్రీరాములు చిన్నకుమార్తె బి.భార్గవి సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పీలేరు, మార్చి1: పీలేరులోని ఇందిరానగర్లో నివసిస్తున్న శ్రీరాములు చిన్నకుమార్తె బి.భార్గవి సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ శివకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.