మల్కాజిగిరిలో యువకుడి అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-15T15:36:34+05:30 IST
ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. మల్కాజిగిరి పోలీసులు
హైదరాబాద్/ఆనంద్బాగ్ : ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపుర రాష్ట్రానికి చెందిన కబీర్ (26) మల్కాజిగిరి సాయినగర్లోని అనుటెక్స్ షాపింగ్మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన తోటి ఉద్యోగి బోలా కాత్రితో కలిసి భవానీ నగర్లో నివసిస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం 6 గంటలకు బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన బోలా కాత్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.