మీ-సేవా కేంద్రాలను పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2021-05-07T05:53:11+05:30 IST

మీ-సేవా కేంద్రాలను పునరుద్ధరించాలి

మీ-సేవా కేంద్రాలను పునరుద్ధరించాలి

మొయినాబాద్‌ రూరల్‌: మండల పరిధిలో ప్రజలకు సరిపడా మీ-సేవా కేంద్రాలు లేకపోవడంతో  ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొత్తం మూడు చోట్ల మీ-సేవా కేంద్రాలుండగా రెండు పనిచేయడం లేదు. రెడ్డిపల్లి కేంద్రం మాత్రమే సేవలు అందిస్తుండడంతో ప్రజలంతా అక్కడికి వెళ్తుండడంతో పనులు సకాలంలో జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని మీసేవా కేంద్రాన్ని రెండు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్‌ చేయగా, హిమయత్‌నగర్‌ చౌరస్తాలోని కేంద్రం నిర్వాహకుడు గుండెపోటుతో మృతిచెందడంతో మీసేవా కేంద్రం మూతపడింది. ఇటీవల పలువురు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారులు స్పందించి మీసేవా కేంద్రాలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-07T05:53:11+05:30 IST