ఓ యువకుడి డెత్ మిస్టరీ.. సజీవంగా కాల్చేశారంటూ అతడి ఆఖరి మాటలు.. భార్యకు కాల్ చేస్తే షాకింగ్ రెస్పాన్స్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-20T20:30:45+05:30 IST

ఆ యువకుడు 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చేరాడు.. హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటూ మరణించాడు.

ఓ యువకుడి డెత్ మిస్టరీ.. సజీవంగా కాల్చేశారంటూ అతడి ఆఖరి మాటలు.. భార్యకు కాల్ చేస్తే షాకింగ్ రెస్పాన్స్.. అసలేం జరిగిందంటే..

ఆ యువకుడు 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చేరాడు.. హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటూ మరణించాడు.. చనిపోయే ముందు తన పేరు రవి అని వైద్యుడికి చెప్పాడు.. రవిపై కొందరు దోపిడీ దొంగలు దాడి చేశారని, రవి ప్రతిఘటించడంతో వారు అతడిని సజీవ దహనం చేశారని చుట్టుపక్కల వారు అనుకున్నారు.. పోలీసులు కూడా మొదట్లో అలాగే భావించారు.. అయితే అతడి బ్యాగ్‌లో ఉన్న డైరీలోని సూసైడ్ నోట్ అనేక సందేహాలు లేవనెత్తుతోంది.. బీహార్‌లోని ముంగేర్‌లో ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

Viral Video: ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై వెళుతూ కళ్ల ముందే అదృశ్యం!


ఆ సూసైడ్ నోట్‌లో.. `నేను నా ఇష్టప్రకారమే చనిపోతున్నాను. నా మరణం వెనుక ఎవరి హస్తమూ లేదు. జీవితంతో విసిగిపోయి ఈ అడుగు వేస్తున్నాను. భరించినంత కాలం కష్టాలను భరించాను. ఈ రోజుతో నా జీవితాన్ని ముగిస్తున్నాను. నేను ఎవరినీ ఏమీ అడగడం లేదు. కానీ, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండ`ని రవి తన సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. ముంగేర్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న రవి శరీరాన్ని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. రవిపై దోపిడీ దొంగలు దాడి చేసి కాల్చేశారని అందరూ భావించారు. 


కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు రవి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాదాపు రెండు నెలలుగా తన భర్తను తాను చూడలేదని ఆమె చెప్పింది. షాకైన పోలీసులు విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. రవి భార్యను విచారించిన తర్వాత ఈ కేసులో స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-20T20:30:45+05:30 IST