వివాహిత కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-20T20:20:44+05:30 IST

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. భర్త ఉండగానే ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది..

వివాహిత కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్.. చివరకు ఏం జరిగిందంటే..

ఆమె వివాహిత.. ఇద్దరు పిల్లలకు తల్లి.. భర్త ఉండగానే ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఐదేళ్ల నుంచి వారి మధ్య అఫైర్ కొనసాగుతోంది.. ఇటీవల ఆమెకు ఓ యువకుడు దగ్గరయ్యాడు.. ఆ యువకుడితో కూడా ఆ మహిళ శారీరక బంధం పెట్టుకుంది.. విషయం తెలుసుకున్న పాత లవర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. ఆ యువకుడికి మద్యం సేవిద్దామని చెప్పి తీసుకెళ్లి చంపేశాడు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


భోపాల్‌కు సమీపంలోని అశోక్ నగర్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి తన ప్రాంతానికే చెందిన ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో ఐదేళ్లుగా అఫైర్ కొనసాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆ మహిళ యోగి అనే యువకుడికి దగ్గరైంది. యోగితో కూడా ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. యోగిని అంతమొందించాలనుకున్నాడు. 


గత బుధవారం మద్యం సేవిద్దామని యోగిని ధర్మేంద్ర పిలిచాడు. మద్యం తాగిన అనంతరం ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ మహిళ గురించి గొడవ పడ్డారు. ఆ గొడవలో యోగి తలపై ధర్మేంద్ర ఓ పెద్ద బండరాయితో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ధర్మేంద్రను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల ఎదుట ధర్మేంద్ర తన నేరాన్ని అంగీకరించాడు.  

Updated Date - 2022-03-20T20:20:44+05:30 IST