రాత్రంతా బాగానే ఉన్న భర్త.. పొద్దునే చనిపోయాడంటూ గగ్గోలు పెట్టిన భార్య.. మృతదేహంపై గాయాల మచ్చలు కనిపించడంతో..

ABN , First Publish Date - 2022-07-05T02:20:43+05:30 IST

వివాహేతర సంబంధాలు ఎన్నో కుటంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యకులు తమ భాగాస్వాములను చంపడానికి కూడా వెనకాడడం లేదు.

రాత్రంతా బాగానే ఉన్న భర్త.. పొద్దునే చనిపోయాడంటూ గగ్గోలు పెట్టిన భార్య.. మృతదేహంపై గాయాల మచ్చలు కనిపించడంతో..

వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యకులు తమ భాగాస్వాములను చంపడానికి కూడా వెనకాడడం లేదు. వివాహేతర సంబంధాల మోజులో పడి మహిళలు కూడా తమ భర్తలను హత్యలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మొహాలీకి చెందిన షరీఫ్ (30) ఢిల్లీలో కార్పొరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య షబ్నం, ముగ్గురు పిల్లలు  బదౌనిలోని ఇస్లాంనగర్‌లో ఉంటున్నారు. భర్త దూరంగా ఉండడంతో షరీఫ్ భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 


ఇది కూడా చదవండి..

Pet Dog మొరిగిందని దారుణం.. ఇనుపరాడ్‌తో కుటుబంపై దాడి.. వీడియో వైరల్!


ఆదివారం సాయంత్రం 5 గంటలకు షరీఫ్ ఇస్లాంనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత షబ్నం అత్తమామలను నిద్రలేపింది. కరెంట్ షాక్ కొట్టి భర్త చనిపోయినట్టు చెప్పింది. షరీఫ్ మెడ, చేతులపై గాయాల గుర్తులు కనిపించాయి. దీంతో కుటుంబీకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులను, పోలీసులను నమ్మించేందుకు షబ్నం గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్టు నాటకం ఆడింది. 


షరీఫ్ హత్యకు గురైనట్టు పోస్ట్‌మార్టం ద్వారా వెల్లడైంది. షబ్నంకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నిజం అంగీకరించింది. తన భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి తినిపించినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. భర్త నిద్రపోయిన తర్వాత అతడిని తాడుతో కట్టేసి ప్రేమికుడి సహాయంతో కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసినట్టు అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు షబ్నంను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

 

Updated Date - 2022-07-05T02:20:43+05:30 IST