రక్తదానంతో ప్రాణాలు కాపాడాలి
ABN , First Publish Date - 2021-10-27T05:10:42+05:30 IST
యువత రక్తదానం చేసి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని అర్బన్ జిల్లా ఏఎస్పీ సుప్రజ పిలుపునిచ్చారు.
రేణిగుంట, అక్టోబరు 26: యువత రక్తదానం చేసి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని అర్బన్ జిల్లా ఏఎస్పీ సుప్రజ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పాతచెక్పోస్టు సమీపంలోని రాజమాత కల్యాణమండపంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మూడునెలలకోసారి రక్తదానం చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామచంద్ర, సీఐలు తదితరులు పాల్గొన్నారు.